2020లో 8 కొత్త స్కూల్స్ దుబాయ్లో ప్రారంభం
- August 27, 20192020 సెప్టెంబర్లో 8 కొత్త స్కూల్స్ దుబాయ్లో ప్రారంభం కానున్నాయి. నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) ఈ వివరాల్ని వెల్లడించింది. ఈ స్కూళ్ళలో 13,000 మందికిపైగా విద్యార్థులకు చోటు లభిస్తుందని అధికారులు వివరించారు. కెహెచ్డిఎ పర్మిట్స్ అండ్ కాంప్లియన్స్ సిఇఓ మొహమ్మద్ దార్విష్ మాట్లాడుతూ కొత్త స్కూళ్ళ ప్రారంబంతో దుబాయ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ సెక్టార్ మరింత బలోపేతమవుతుందని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభమవుతున్న స్కూల్స్ అల్ త్వార్ 2, అల్ కుసైస్, జుమైరా విలేజ్ ట్రయాంగిల్, అల్ కోజ్ మరియు జబెల్ అలి తదితర ప్రాంతాల్లో వున్నాయి. 2008లో 38గా వున్న స్కూళ్ళ సంఖ్య ఇప్పుడు 119కి పెరిగిందని దార్వష్ వివరించారు. గత మూడేళ్ళలో కొత్తగా 41 స్కూల్స్ ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి