తమిళనాడులో చొరబడిన తీవ్రవాదులు!
- August 29, 2019తమిళనాడులో ఉగ్రవాదులు చొరబడ్డారన్న నిఘావర్గాల సమాచారంతో.. కోయంబత్తూర్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది జాతీయదర్యాప్తు సంస్థ. దీంతో పాటు మరో ఐదు ప్రాంతాల్లోనూ తనిఖీలు చేపట్టింది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లతో పాటు పలు మాల్స్లో సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులు. వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన వ్యక్తుల్ని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
కోయంబత్తూరులో పట్టుబడిన అజరుద్దీన్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ తనిఖీలు చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. శ్రీలంక ద్వారా సముద్ర మార్గంలో ఉగ్రవాదులు చొరబడినట్లు ఎన్ఐఏకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. కొలంబో దాడుల అనంతరం.. ఇప్పటికే తూర్పు తీర రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ సోదాలు చేస్తోంది.
అనుమానితుల నుంచి ఎన్ఐఏ అధికారులు సెల్ఫోన్లు, ల్యాప్టాప్, సిమ్కార్డులు, పెన్డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు. అటు.. ఏపీలోని నెల్లూరు జిల్లాలోనూ పలు చోట్ల పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు