భారత్‌లో టెర్రర్‌ ఎటాక్‌ని ఖండించిన యూఏఈ

- January 08, 2016 , by Maagulf
భారత్‌లో టెర్రర్‌ ఎటాక్‌ని ఖండించిన యూఏఈ

భారతదేశంలో ఇటీవల తీవ్రవాదులు దాడి చేయడాన్ని యూఏఈ ఖండించింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదులు దాడి చేయడం, ఈ ఘటనలో ఆరుగురు తీవ్రాదులు, ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. యూఏఈ ఈ దాడిని ఖండిస్తూ, తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ చేసే పోరాటంలో, ఆ దేశానికి మద్దతుగా తాము ఉంటామని ప్రకటించింది. యూఏఈ ఫారిన్‌ మినిస్ట్రీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాదం, తీవ్రవాదానికి సరిహద్దులు లేకుండా పోయాయని, ప్రపంచంలోని అన్ని దేశాలూ తీవ్రవాద పీడిత దేశాలుగా మారిపోయాయని ప్రకటనలో యూఏఈ ఫారిన్‌ మినిస్ట్రీ పేర్కొంది. ప్రపంచమంతా ఒక్కతాటిపైకి వచ్చి ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కొనాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటనలో యూఏఈ అభిప్రాయపడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com