భారత్లో టెర్రర్ ఎటాక్ని ఖండించిన యూఏఈ
- January 08, 2016
భారతదేశంలో ఇటీవల తీవ్రవాదులు దాడి చేయడాన్ని యూఏఈ ఖండించింది. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు దాడి చేయడం, ఈ ఘటనలో ఆరుగురు తీవ్రాదులు, ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. యూఏఈ ఈ దాడిని ఖండిస్తూ, తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటంలో, ఆ దేశానికి మద్దతుగా తాము ఉంటామని ప్రకటించింది. యూఏఈ ఫారిన్ మినిస్ట్రీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాదం, తీవ్రవాదానికి సరిహద్దులు లేకుండా పోయాయని, ప్రపంచంలోని అన్ని దేశాలూ తీవ్రవాద పీడిత దేశాలుగా మారిపోయాయని ప్రకటనలో యూఏఈ ఫారిన్ మినిస్ట్రీ పేర్కొంది. ప్రపంచమంతా ఒక్కతాటిపైకి వచ్చి ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కొనాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటనలో యూఏఈ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







