మహిళా బస్‌ ప్యాసింజర్లు పెరిగారు

- January 08, 2016 , by Maagulf
మహిళా బస్‌ ప్యాసింజర్లు పెరిగారు



దోహాలో గడచిన ఐదేళ్లలో మహిళా ప్యాసింజర్ల సంఖ్య పెరిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కర్వా బస్‌ డ్రైవర్లు ఈ విషయాన్ని ధృవీకరించారు. ట్యాక్సీలలో ప్రయాణించడం కన్నా బస్సుల్లో ప్రయాణించడం సురిక్షితమని మహిళా ప్రయాణీకులు భావిస్తున్నారట. ఫిలిప్పీన్స్‌, ఇండియా, శ్రీలంక నుంచి వచ్చిన మహిళా కార్మికులు ఎక్కువగా గల్ఫ్‌, ల్యాండ్‌ మార్క్‌, ఎజ్డాన్‌, విల్లాజియో, హయాత్‌ ప్లాజా, అల్‌ ఖోర్‌ మాల్‌ మరియు సిటీ సెంటర్‌ దోహా తదితర షాపింగ్‌ మాల్స్‌లో పనిచేస్తున్నారనీ, వారిలో ఎక్కువమంది బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారని కర్వా బస్‌ నిర్వాహకులు వెల్లడించారు. కర్వా బస్‌ డ్రైవర్‌ ఒరు 2010లో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య తక్కువగా ఉండేదనీ, ఆ సంఖ్య ఇప్పుడు ఎక్కువైందనీ అన్నారు. మహిళలు వీలైతే సొంత కార్లలో ప్రయాణించేందుకు ఇష్టపడ్తున్నారనీ లేదంటే బస్సులను ఆశ్రయిస్తున్నారనీ ట్యాక్సీలను ఎక్కువగా ఇష్టపడటంలేదని ట్యాక్సీ డ్రైవర్‌ ఒకరు చెప్పారు. దోహాలోని డ్రైవింగ్‌ స్కూల్స్‌లో శిక్షణ కోసం వస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com