మహిళా బస్ ప్యాసింజర్లు పెరిగారు
- January 08, 2016
దోహాలో గడచిన ఐదేళ్లలో మహిళా ప్యాసింజర్ల సంఖ్య పెరిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కర్వా బస్ డ్రైవర్లు ఈ విషయాన్ని ధృవీకరించారు. ట్యాక్సీలలో ప్రయాణించడం కన్నా బస్సుల్లో ప్రయాణించడం సురిక్షితమని మహిళా ప్రయాణీకులు భావిస్తున్నారట. ఫిలిప్పీన్స్, ఇండియా, శ్రీలంక నుంచి వచ్చిన మహిళా కార్మికులు ఎక్కువగా గల్ఫ్, ల్యాండ్ మార్క్, ఎజ్డాన్, విల్లాజియో, హయాత్ ప్లాజా, అల్ ఖోర్ మాల్ మరియు సిటీ సెంటర్ దోహా తదితర షాపింగ్ మాల్స్లో పనిచేస్తున్నారనీ, వారిలో ఎక్కువమంది బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారని కర్వా బస్ నిర్వాహకులు వెల్లడించారు. కర్వా బస్ డ్రైవర్ ఒరు 2010లో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య తక్కువగా ఉండేదనీ, ఆ సంఖ్య ఇప్పుడు ఎక్కువైందనీ అన్నారు. మహిళలు వీలైతే సొంత కార్లలో ప్రయాణించేందుకు ఇష్టపడ్తున్నారనీ లేదంటే బస్సులను ఆశ్రయిస్తున్నారనీ ట్యాక్సీలను ఎక్కువగా ఇష్టపడటంలేదని ట్యాక్సీ డ్రైవర్ ఒకరు చెప్పారు. దోహాలోని డ్రైవింగ్ స్కూల్స్లో శిక్షణ కోసం వస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







