కాబుల్:బాంబు దాడి.. 16మంది మృతి..
- September 03, 2019కాబూల్ నగరంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గ్రీన్ విల్లే సమీపంలో బాంబుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 16మంది మరణించారు. 120 మంది గాయపడ్డారు. వీరిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనకు తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించుకున్నారు. అమెరికా ప్రతినిధి అల్మయ్ ఖలీల్జాద్ తమ దళాలను ఉపసంహరించుకునే ప్రతిపాదనపై చర్చించేందుకు కాబూల్ వచ్చిన సందర్భంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు పదార్ధాలు నింపిన వాహనంతో ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికిచేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ