యూఏఈలో అందుబాటులోకి మరో 3డి జీబ్రా క్రాసింగ్
- September 05, 2019
రస్ అల్ ఖైమా పోలీస్, ఎమిరేట్లోని పలు ప్రాంతాల్లో త్రీడీ జీబ్రా క్రాసింగ్స్ని ఏర్పాటు చేసే పనుల్ని వేగవంతం చేస్తున్నారు. ఎమిరేట్లో తొలి త్రీడీ జీబ్రా క్రాసింగ్ షేక్ మొహమ్మద్ బిన్ సలెమ్ రోడ్డుపై ఏర్పాటు చేశారు. యూకే మరియు ఇండియా తదితర దేశాల్లో ఈ విధానం కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. పెడెస్ట్రియన్ లైన్స్ వద్ద వాహనాలు వేగం తగ్గించడానికి ఈ త్రీడీ ముద్రిత జీబ్రా లైన్స్ ఉపయోగపడతాయి. రన్ ఓవర్ యాక్సిడెంట్లను ఈ త్రీడీ ముద్రిత జీబ్రా క్రాసింగ్స్ తగ్గిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, రోడ్లను దాటే పాదచారులు రోడ్డుపై వేగంగా వచ్చే వాహనాల పట్ల అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు అధికారులు. ఆర్టికల్ 43 ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, పాదచారులకు ప్రాధాన్యమివ్వకుండా వాహనాలు నడిపేవారికి 500 దిర్హామ్ల జరీమానా, ఆరు బ్లాక్ పాయింట్స్ విధిస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!







