గ్లోబల్ సేల్ని ప్రకటించిన ఎమిరేట్స్, ఎతిహాద్
- September 06, 2019యూఏఈకి చెందిన రెండు ఎయిర్ క్యారియర్స్ గ్లోబల్ సేల్స్ని ప్రకటించాయి. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ 795 దిర్హామ్ల నుంచి టిక్కెట్ ధరలు ప్రారంభమవుతాయని ప్రకటించగా, ఎతిహాద్ సంస్థ సెప్టెంబర్ సేల్స్ని అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ గ్లోబల్ సేల్ ద్వారా ఎతిహాద్, 15 సెప్టెంబర్ 2019 నుంచి 30 జూన్ 2020 వరకు తక్కువ టిక్కెట్ ధరలతో 50 డెస్టినేషన్స్కి ప్రయాణించే వీలు కల్పిస్తోంది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విషయానికొస్తే, మిడిల్ ఈస్ట్ డెస్టినేషన్స్కి 795 దిర్హామ్ల ఖర్చుతో, వెస్ట్ ఏసియా మరియు ఇండియన్ ఓషన్ విమానాలకు 825 దిర్హామ్ల ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 10 వరకు బుకింగ్ చేసుకున్న టిక్కెట్లకు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..