ముస్లిం దేశ కరెన్సీపై గణపతి

- September 06, 2019 , by Maagulf
ముస్లిం దేశ కరెన్సీపై గణపతి

ఇండోనేషియా:హిందువుల ఆరాధ్య దైవం.. తొలి పూజలు అందుకునే లంబోదరుడు.. ఆ గణ నాయకుడు ముస్లిం దేశంలో కూడా కీర్తింపబడ్డాడు. వారు ఉపయోగించే కరెన్సీ నోట్లపై వినాయకుడి విగ్రహాన్ని ముద్రించేంతగా. బాలీవుడ్ డైరక్టర్ తనుజ్ గార్గ్ ఆనోటుని ట్విట్టర్‌లో పోస్ట్ చేసేవరకు ఎవరికీ ఈ విషయం గురించి అంతగా తెలియదు. ఇంతకీ ఆ దేశం పేరేమిటో తెలుసా.. 87.2 % మంది ముస్లింలు నివసించే ఇండోనేషియా. ఇక్కడ హిందువులు 1.7 శాతం మాత్రమే ఉన్నారు. గార్గ్ ట్వీట్‌లో ఇదే విషయాన్ని పేర్కొంటూ.. ప్రపంచంలో వినాయకుడి చిత్రాన్ని కరెన్సీ నోటుపై ముద్రించిన ఏకైక ముస్లిం దేశం.. ఇండోనేషియా అని ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com