మాంసం వ్యాపారం: ఆరుగురు యూఏఈ రెసిడెంట్స్‌పై విచారణ

- September 07, 2019 , by Maagulf
మాంసం వ్యాపారం: ఆరుగురు యూఏఈ రెసిడెంట్స్‌పై విచారణ

ఆరుగురు ఆసియా రెసిడెంట్స్‌పై మాంసం వ్యాపారం అభియోగాలతోపాటు, మహిళల్ని నిర్బంధించడం, పోలీసుల్లా డూప్‌ చేయడం వంటి అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేశారు అధికారులు. ఓ బాధితురాలు, నిందితులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలపడంతో, పోలీసులు అలెర్ట్‌ అయి ఈ ఫ్లెష్‌ ట్రేడ్‌ రాకెట్‌ గుట్టు రట్టు చేశారు. ఆరుగురు నిందితుల్లో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం వుందనీ, నిందితులు సీఐడీ అధికారుల రూపంలో ఇతరుల్ని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తూ వచ్చారనీ, తమని బంధించి తమతో బలవంతంగా వ్యభిచారం చేయించారని బాధితుల్లో ఒకరైన ఓ మహిళ పోలీసుల ముందు వాపోయింది. ఈ కేసు విచారణను సెప్టెంబర్‌ 25కి వాయిదా వేసింది న్యాయస్థానం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com