చైనా కు తెగేసి చెప్పేసిన భారత్
- September 08, 2019
న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీకి భారత ప్రభుత్వం షాకిచ్చింది. కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన వంటి అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పాకిస్థాన్లో పర్యటించాలని చైనా మంత్రి నిర్ణయించారు. ఆ వెంటనే భారత్లోనూ ఆయన పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అయితే, వాంగ్ యీ షెడ్యూల్పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తొలుత పాకిస్థాన్లో కనుక పర్యటించాలనుకుంటే ఇక భారత్ రావాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పింది. రెండు దేశాల్లోనూ వెంట వెంటనే పర్యటించాలనుకుంటే తాము అంగీకరించబోమని, షెడ్యూలును మార్చుకోవాలని భారత స్పష్టం చేసింది. రెండు దేశాల్లోనూ ఒకేసారి పర్యటిస్తే అది రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నిబంధన ఒక్క చైనాకే కాకుండా ఇరు దేశాల్లో పర్యటించాలనుకున్న అన్ని దేశాలకు ఇది వర్తిస్తుందని భారత్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి







