తొలి సీమాంతర పెట్రోలియం పైప్లైన్ను ప్రారంభించిన ప్రధానులు
- September 11, 2019
దక్షిణాసియాలో తొలి సీమాంతర పెట్రోలియం పైప్లైన్ను ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని కే.పీ.శర్మ ఓలీ సంయుక్తంగా ప్రారంభించారు. భారత్లోని మోతీ హారీ, నేపాల్లోని ఆమ్లేఖ్గంజ్ మధ్య ఈ పైప్లైన్ నిర్మించారు. దీని పొడవు 60 కిలోమీటర్లు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. ఈ పైప్లైన్ ఇరుదేశాల మధ్య మైత్రికి నిదర్శనమన్నారు ప్రధాని మోదీ. దీని నిర్మాణంలో నేపాల్ ప్రభుత్వ సహకారం మరువలేనిదన్నారు. ఇరుదేశాల కృషి వల్లే ఈ చరిత్రాత్మక ప్రాజెక్ట్.. అనుకున్న సమయానికంటే ముందే పూర్తైందన్నారు మోదీ..
1996లోనే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ.. 2016లో మోదీ నేపాల్ పర్యటన తర్వాతనే ఇది కార్యరూపం దాల్చింది. ఈ ఏడాదిలో ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ అది కాలేదు. నేపాల్లోని పార్సా జాతీయ పార్క్లో చెట్ల నరికివేతకు అనుమతులు ఇచ్చే విషయంలో జాప్యం జరిగింది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!