తొలి సీమాంతర పెట్రోలియం పైప్లైన్ను ప్రారంభించిన ప్రధానులు
- September 11, 2019దక్షిణాసియాలో తొలి సీమాంతర పెట్రోలియం పైప్లైన్ను ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని కే.పీ.శర్మ ఓలీ సంయుక్తంగా ప్రారంభించారు. భారత్లోని మోతీ హారీ, నేపాల్లోని ఆమ్లేఖ్గంజ్ మధ్య ఈ పైప్లైన్ నిర్మించారు. దీని పొడవు 60 కిలోమీటర్లు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. ఈ పైప్లైన్ ఇరుదేశాల మధ్య మైత్రికి నిదర్శనమన్నారు ప్రధాని మోదీ. దీని నిర్మాణంలో నేపాల్ ప్రభుత్వ సహకారం మరువలేనిదన్నారు. ఇరుదేశాల కృషి వల్లే ఈ చరిత్రాత్మక ప్రాజెక్ట్.. అనుకున్న సమయానికంటే ముందే పూర్తైందన్నారు మోదీ..
1996లోనే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ.. 2016లో మోదీ నేపాల్ పర్యటన తర్వాతనే ఇది కార్యరూపం దాల్చింది. ఈ ఏడాదిలో ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ అది కాలేదు. నేపాల్లోని పార్సా జాతీయ పార్క్లో చెట్ల నరికివేతకు అనుమతులు ఇచ్చే విషయంలో జాప్యం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ