తొలి సీమాంతర పెట్రోలియం పైప్లైన్ను ప్రారంభించిన ప్రధానులు
- September 11, 2019
దక్షిణాసియాలో తొలి సీమాంతర పెట్రోలియం పైప్లైన్ను ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని కే.పీ.శర్మ ఓలీ సంయుక్తంగా ప్రారంభించారు. భారత్లోని మోతీ హారీ, నేపాల్లోని ఆమ్లేఖ్గంజ్ మధ్య ఈ పైప్లైన్ నిర్మించారు. దీని పొడవు 60 కిలోమీటర్లు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. ఈ పైప్లైన్ ఇరుదేశాల మధ్య మైత్రికి నిదర్శనమన్నారు ప్రధాని మోదీ. దీని నిర్మాణంలో నేపాల్ ప్రభుత్వ సహకారం మరువలేనిదన్నారు. ఇరుదేశాల కృషి వల్లే ఈ చరిత్రాత్మక ప్రాజెక్ట్.. అనుకున్న సమయానికంటే ముందే పూర్తైందన్నారు మోదీ..
1996లోనే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ.. 2016లో మోదీ నేపాల్ పర్యటన తర్వాతనే ఇది కార్యరూపం దాల్చింది. ఈ ఏడాదిలో ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ అది కాలేదు. నేపాల్లోని పార్సా జాతీయ పార్క్లో చెట్ల నరికివేతకు అనుమతులు ఇచ్చే విషయంలో జాప్యం జరిగింది.
తాజా వార్తలు
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!







