నీరవ్ సోదరుడు నేహాల్మోడీ పై రెడ్కార్నర్ నోటీస్!
- September 13, 2019
పంజాబ్ నేషనల్బ్యాంకులో 13వేల కోట్ల రుణపరపతి కుంభకోణాలకు సంబంధించి నిందితునిగా ఉన్న వజ్రాభరణాల వ్యాపారి నీరవ్మోడీ సోదరుడు నేహాల్మోడీ కోసం ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీస్ జారీ చేసింది. బెల్జియం దేశస్తునిగా ఉన్న 40ఏళ్ల నేహాల్పై గ్లోబల్ అరెస్టు వారంట్ జారీ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రకటించారు. ఈ కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై ఇడి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. నేహాల్ దీపఖ్మోడీ బెల్జియంలోని యాంట్వెర్ప్లో జన్మించారు. ఆయనకు ఇంగ్లీషు, గుజరాతి, హిందీ భాషలు వచ్చని రెడ్కార్నర్ నోటీస్లో వివరించారు. ఇడి అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీటులో నేహాల్ మోడీపేరును కూడా చేర్చారు. అంతేకాకుండా ఆయన సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కుట్రలు చేసారని ఆరోపించింది. నీరవ్మోడీతో పాటు ఆయన మేనమామ మెహుల్చోక్సీని కూడా ఈ భారీ కుంభకోణంలో ప్రధాన సూత్రదారులు, నిందితులుగా ఇడి, సిబిఐ దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. సుమారు 14వేల కోట్లమేరకు తమ బ్యాంకు నష్టపోయిందని పంజాబ్నేషనల్బ్యాంకు వెల్లడించింది.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









