నీరవ్ సోదరుడు నేహాల్మోడీ పై రెడ్కార్నర్ నోటీస్!
- September 13, 2019పంజాబ్ నేషనల్బ్యాంకులో 13వేల కోట్ల రుణపరపతి కుంభకోణాలకు సంబంధించి నిందితునిగా ఉన్న వజ్రాభరణాల వ్యాపారి నీరవ్మోడీ సోదరుడు నేహాల్మోడీ కోసం ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీస్ జారీ చేసింది. బెల్జియం దేశస్తునిగా ఉన్న 40ఏళ్ల నేహాల్పై గ్లోబల్ అరెస్టు వారంట్ జారీ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రకటించారు. ఈ కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై ఇడి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. నేహాల్ దీపఖ్మోడీ బెల్జియంలోని యాంట్వెర్ప్లో జన్మించారు. ఆయనకు ఇంగ్లీషు, గుజరాతి, హిందీ భాషలు వచ్చని రెడ్కార్నర్ నోటీస్లో వివరించారు. ఇడి అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీటులో నేహాల్ మోడీపేరును కూడా చేర్చారు. అంతేకాకుండా ఆయన సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కుట్రలు చేసారని ఆరోపించింది. నీరవ్మోడీతో పాటు ఆయన మేనమామ మెహుల్చోక్సీని కూడా ఈ భారీ కుంభకోణంలో ప్రధాన సూత్రదారులు, నిందితులుగా ఇడి, సిబిఐ దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. సుమారు 14వేల కోట్లమేరకు తమ బ్యాంకు నష్టపోయిందని పంజాబ్నేషనల్బ్యాంకు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ