23 మంది ఇండియన్స్‌ పాస్‌పోర్టులు దగ్ధం

- January 09, 2016 , by Maagulf
23 మంది ఇండియన్స్‌ పాస్‌పోర్టులు దగ్ధం


అడ్రెస్‌ డౌన్‌టౌన్‌ హోటల్‌ అగ్ని ప్రమాదం కారణంగా 23 మంది ఇండియన్స్‌ పాస్‌పోర్టుల్ని కోల్పోయారు. 63 అంతస్తుల భారీ భవంతి న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా జరిగిన అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఈ సందర్భంగా పలువురు పాస్‌పోర్టులు కోల్పోవడంతో, హోటల్‌ యాజమాన్యం, ఆయా దేశాల ఎంబసీలతో మాట్లాడి బాధితులకు పాస్‌పోర్ట్‌ సమస్యల నుంచి ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టింది. ఇండియన్‌ ఎంబసీ కూడా ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ని ఏర్పాటు చేసింది. మ్రాదం జరిగిన సమయంలో 72 మంది ఇండియన్‌ నేషనల్స్‌ రూమ్స్‌ బుక్‌ చేసుకుని వున్నారనీ, వారిలో చాలామందికి తమ సహాయం అవసరం లేకుండానే, ఎంబసీ సహకరించిందనీ, 23 మంది మాత్రం తమను సంప్రదించారనీ, వారి అప్లికేషన్లను ప్రాసెస్‌ చేస్తున్నామని హాస్టల్‌ యాజమాన్యం వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com