ఏపీలో బీర్ల అమ్మకం 13శాతం ఎలా పెరిగాయి?: పవన్
- September 14, 2019
అమరావతి: ఏపీలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై జనసేనాధిపతి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ సర్కార్ తీరుపై విమర్శనాస్త్రాలు విసిరారు. ‘ఏపీలో మద్యపాన నిషేధం అమలు చేస్తామంటున్నారు. ఏపీలో మద్యపాన నిషేధం అమలు చేస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గాలి కదా?. ఈ మూడు నెలల్లో బీర్ల అమ్మకం 13శాతం ఎలా పెరిగాయి. వైసీపీ ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధంపై నమ్మకం లేదు’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. రైతుల విత్తనాల గురించి మాట్లాడిన ఆయన.. విత్తనాలు ఇవ్వడంలో వైసీపీ విఫలమైందన్నారు. ఏపీలో పంచాల్సిన విత్తనాలు... మహారాష్ట్రలో తేలాయన్నారు. రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదని ఈ సందర్భంగా పవన్ తెలిపారు. అయితే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







