రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి

- September 14, 2019 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి

మస్కట్‌: అల్‌ వుస్తా గవర్నరేట్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం 8 మందిని బలిగొంది. రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పౌరులు, ముగ్గురు వలసదారులు మృతి చెందారు. అతివేగంతో దూసుకొచ్చిన కారు ఇంకో కారుని ఢీకొందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com