ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో విదేశీ సైన్యం..
- January 09, 2016
ఈ ఏడాది జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి జరగనున్న పరేడ్లో మొట్టమొదటిసారి ఓ విదేశీ సైన్యం వేడుకల్లో పాల్గొననుంది. అంతేకాదు కవాతులో పాల్గొనే త్రివిధ దళాల బృందాలను తగ్గించడంతో పాటు పరేడ్ నిడివిని కూడా భారీగా తగ్గించారు.దేశ చరిత్రలో ఓ విదేశీ సైన్యం, భారత సైన్యంతో కలిసి పరేడ్ పాల్గొనవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది జరిగే రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ముఖ్యఅతిధిగా విచ్చేస్తున్నారు.దీంతో భారత్ కొత్త ప్రదాయానికి తెరతీసింది.ఎర్రకోట పరేడ్లో ఫ్రెంచ్ సైనిక దళం భారత సైన్యంతో కలిసి పాల్గొననుంది. ఇందు కోసం ఫ్రెంచ్ సైన్యం ఇప్పటికే భారత్కు చేరుకుంది. 14 జూలై, 1789న బాసిల్స్ కోట ధ్వంసాన్ని పురస్కరించుకుని(ఫ్రెంచ్ విప్లవానికి నాంది) 2009లో ఫ్రాన్స్లో జరిగిన వేడుకల్లో భారత్ అతి పురాతన రెజిమెంట్ మరాఠా లైట్ దళం పాల్గొంది.పారిస్లోని ప్రాఖ్యాత చాంప్స్ ఎల్సీ వద్ద ఫ్రెంచ్ సైన్యంతో కలిసి భారత్ దళం పరేడ్ చేసింది. ఆ వేడుకల్లో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కాగా భారత రిపబ్లిక్ పరేడ్లో ఫ్రెంచ్ ప్రతినిధి పాల్గొనడం ఇది ఐదోసారి. ప్రపంచంలో ఏ దేశ ప్రతినిధి కూడా ఇన్నిసార్లు పాల్గొనలేదు. రక్షణ, శక్తి, అంతరిక్షం, వాణిజ్యం వంటి రంగాల్లో భారత్-ఫ్రాన్స్లు బలమైన సంబంధాలను కలిగిఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







