ఒమన్‌ కుటుంబం హత్య కేసులో భారత జాతీయుడి అరెస్ట్‌

- September 18, 2019 , by Maagulf
ఒమన్‌ కుటుంబం హత్య కేసులో భారత జాతీయుడి అరెస్ట్‌

అహ్మదాబాద్‌: ఒమన్‌ కుటుంబాన్ని హత్య చేశాడనే అనుమానంతో ఓ భారత జాతీయుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌), నిందితుడ్ని అహ్మదాబాద్‌లో అరెస్ట్‌ చేసింది. ఇంటర్నేషనల్‌ పోలీస్‌ ఛానెల్స్‌, ఇంటర్‌పోల్‌ ఇచ్చిన నోటీసు మేరకు భారత పోలీసు యంత్రాంగం స్పందించి, నిందితుడ్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. ఒమన్‌లో వాంటెడ్‌ పీపుల్స్‌ లిస్ట్‌లో నిందితుడు వున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య కేసులో నిందితుడిపై అభియోగాలున్నాయి. మృతిచెందినవారిలో 12 ఏళ్ళు, తమ్మిదేళ్ళు, ఆరేళ్ళ వయసున్న చిన్నారులూ వున్నారు. ఒమన్‌ అథారిటీస్‌, నిందితుడికి సంబంధించిన వివరాల్ని భారత పోలీసులకు అందించడంతో, నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com