ఒమన్ కుటుంబం హత్య కేసులో భారత జాతీయుడి అరెస్ట్
- September 18, 2019అహ్మదాబాద్: ఒమన్ కుటుంబాన్ని హత్య చేశాడనే అనుమానంతో ఓ భారత జాతీయుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), నిందితుడ్ని అహ్మదాబాద్లో అరెస్ట్ చేసింది. ఇంటర్నేషనల్ పోలీస్ ఛానెల్స్, ఇంటర్పోల్ ఇచ్చిన నోటీసు మేరకు భారత పోలీసు యంత్రాంగం స్పందించి, నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒమన్లో వాంటెడ్ పీపుల్స్ లిస్ట్లో నిందితుడు వున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య కేసులో నిందితుడిపై అభియోగాలున్నాయి. మృతిచెందినవారిలో 12 ఏళ్ళు, తమ్మిదేళ్ళు, ఆరేళ్ళ వయసున్న చిన్నారులూ వున్నారు. ఒమన్ అథారిటీస్, నిందితుడికి సంబంధించిన వివరాల్ని భారత పోలీసులకు అందించడంతో, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ