జగన్మాత దుర్గమ్మకు లక్ష్మీ కాసుల హారం సమర్పించిన ఎమ్మెల్యే
- September 18, 2019ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లను గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం నంబూరు శంకర్రావు దంపతులు అమ్మవారికి అలంకరణ నిమిత్తం తయారు చేయించిన 135 గ్రాముల బరువు గల బంగారు లక్ష్మి కాసుల హారాన్ని దేవస్థానం ఈవో ఎం.వి.సురేష్బాబుకు అందజేశారు. అమ్మవారికి బహుకరించిన హారంలో రాళ్ళ సూత్రాలు బంగారు తీగతో చుట్టబడి ఉన్నాయని, అందులో 62 లక్ష్మి కాసులు, 142 తెలుపు రాళ్ళు, 2 ఎరుపు రాళ్ళు మరియు నాన్కోడ్ ఉన్నాయని దాతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కుటుంబ సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం గావించి అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…