'హౌడీ మోడీ'లో జాతీయ గీతం పాడనున్న భారతీయ సంతతి టీన్
- September 22, 2019
అమెరికా:హౌడీ మోదీ కార్యక్రమంలో ఓ వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. అతని పేరు స్పర్శ్ షా. 16 ఏళ్ల స్పర్శ్, హౌడీ మోదీ మీటింగ్లో జాతీయ గీతాన్ని ఆలపించనున్నాడు. ఓ యువకుడు జాతీయ గీతాన్ని ఆలపించడం పెద్ద విశేషమేమీ కాదు కానీ, స్పర్శ్ మాత్రం అందుకు మినహాయింపు. ఇతను వికలాంగుడు. అరుదైన వ్యాధి కారణంగా స్పర్శ్ నడవలేడు. ఈ వైకల్యాన్ని నిర్వాహకులు పట్టించుకోలేదు. అతని ప్రతిభకే పెద్ద పీట వేశారు. మోదీ మీటింగ్లో నేషనల్ ఆంథెమ్ను పాడే అవకాశాన్ని కల్పించారు. ఈ అవకాశంపై స్పర్శ్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీని కలుసుకునే ఛాన్స్ రావడం తనకెంతో గొప్ప విషయమని చెప్పాడు.
ప్రస్తుతం స్పర్శ్ అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్నాడు. అతను పుట్టుకతోనే ఆస్టియోజెన్సిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. తల్లి కడుపులో ఉన్నప్పుడే 35 ఎముకలు విరిగిపోయాయి. మొత్తంగా స్పర్శ్ శరీరంలో 130కి పైగా ఎముకలు విరిగిపోయాయి. దాంతో అతను స్పర్శ్ నడవలేడు. ఐనప్పటికీ స్పర్శ్ వెనక్కి తగ్గలేదు. వైకల్యాన్ని అధిగమించి వివిధ రంగాల్లో తన ప్రతిభను ప్రదర్శించాడు. సింగర్గా, రచయితగా, మోటివేషనల్ స్పీకర్గా పేరు సంపాదించాడు. 2018 బ్రిటల్ బోన్ రేపర్ అనే పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీలో స్పర్శ్ షాహ్ జీవితాన్ని చూపించారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







