హైదరాబాద్:కేసీఆర్ తో భేటీ కానున్న జగన్
- September 22, 2019
హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మళ్లీ సమావేశమవుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ.. కృష్ణా గోదావరి నదుల అనుసంధానంపై వారు చర్చించనున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సెప్టెంబరు 23, సోమవారం ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్తో ఆయన ప్రగతి భవన్ లో భేటీ కానున్నారు. ఇప్పటికే రెండు సార్లు సమావేశమైన వీరు.. ముచ్చటగా మూడో సారి భేటీ అవుతున్నారు.. సీఎంలతోపాటు మంత్రులు, సీనియర్ అధికారులు ఈ భేటీలో పాల్గొంటారు.
ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. వరద నీటిని వృధాగా సముద్రంలోకి వదలడం కన్నా.. సద్వినియోగం చేసి కరవు ప్రాంతాల్లో నీటి కష్టాలు తీర్చాలని ఇద్దరు సీఎంలు భావిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్టులపై చర్చించిన ముఖ్యమంత్రులు.. ఇప్పుడు నదుల అనుసంధానంపై ప్రత్యేకంగా చర్చించే అవకాశముంది. అంతేకాదు.. విభజన సమస్యలపైనా సీఎంల మధ్య చర్చలు జరుగనున్నాయి.
ఇంతకుముందు జరిగిన సమావేశాల్లో విభజన సమస్యలతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీటి పంపకాలపై చర్చించారు. ఇప్పుడు మరోసారి సమావేశమై నదుల అనుసంధానంపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. నదుల అనుసంధానికి సంబంధించి ఇప్పటికే ఇరు రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేశారు. నివేదికలు సీఎంలకు అందజేశారు. దీంతో నదుల అనుసంధానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..