కశ్మీర్లో ఉగ్ర కుట్ర భగ్నం
- September 23, 2019
కశ్మీర్: కశ్మీర్లో పెను ప్రమాదం తప్పింది. ఉగ్ర కుట్న భగ్నమైంది. జమ్మూ కశ్మీర్లో మారణహోమం సృష్టించడానికి ఉగ్రవాదుల పన్నిన కుట్రను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. కథువా ప్రాంతంలోని దెవాల్ గ్రామం లో 40 కిలోల పేలుడు పదార్థాలను సైనిక దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
కశ్మీర్ లోయలో సైన్యంపై విరుచుకుపడడానికి ఉగ్రవాదులు ప్రణాళిక రచిస్తున్నాయని కొన్ని రోజులుగా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇటీవల ఐబీ నుంచి సైన్యానికి మరోసారి విశ్వసనీయమైన సమాచారం అందింది. దాంతో సైనిక బలగాలు, కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. అనుమానిత ప్రాంతంలో గాలింపు జరిపారు. ఈ సోదాల్లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలు దేశీయంగా తయారు చేసినవేనని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







