తల్లిని వెతుక్కుంటూ..
- January 10, 2016
పాతికేళ్ల క్రితం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన తల్లి కోసం ఇద్దరు కుమార్తెలు వెతుకులాట ప్రారంభించారు. తల్లి ఫోటో పట్టుకుని నగరానికి చేరుకున్నారు. హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతోపాటు సోషల్ మీడియాలోనూ వెతుకుతున్నారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం పాతబస్తీకి చెందిన రజియా సాహెబ్ దుబాయ్కు చెందిన రషీద్ ఈద్ ఉబేద్ను వివాహం చేసుకుంది. భర్తతో దుబాయ్కు వెళ్లింది. ఆమెకు ఆయేషా, ఫాతిమా అనే ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. పిల్లలకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు భర్తతో వచ్చిన విబేధాల కారణంగా విడాకులు తీసుకుని 1988లో హైదరాబాద్కు ఆమె వచ్చేశారు. దీంతో రషీద్ మరో పెళ్లి చేసుకున్నారు. మొదటి నుంచి రెండో ఆమెనే ఆయేషా, ఫాతిమా తల్లిగా భావించారు. అయితే కొద్ది రోజుల క్రితం తండ్రి మరణంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో తల్లిని వెతుక్కుంటూ ఆమె ఫోటో పట్టుకుని హైదరాబాద్ బాట పట్టారు. ఇద్దరు యువతుల ఫిర్యాదు మేరకు సౌత్ జోన్ పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. వెతుకులాట ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







