పాకిస్థాన్లో భారీ భూకంపం..3 మృతి, 50 కు పైగా మందికి గాయాలు
- September 24, 2019
పాకిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.8 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇస్లామాబాద్, అజద్ కశ్మీర్, పెషావర్, రావల్పిండి, లాహోర్ పట్టణాల్లో భూకంపంతో రహదారులు దెబ్బతిన్నాయి. పీవోకేలోని మీర్పూర్లో ఓ భవనం కుప్పకూలింది. వివిధ ప్రాంతాల్లో ముగ్గురు మృతి, సుమారు 50 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని పీవోకేలోని ఆస్పత్రులకు తరలించారు. భూప్రకంపనలతో భవనాల్లో నుంచి భయంతో పరుగులు తీసినట్లు ప్రత్యక్షసాక్షులు మీడియాతో చెప్పారు. భూకంపంతో మీర్పూర్లోని రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాలా వాహనాలు బోల్తా పడ్డాయి. పంజాబ్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతమైన జెహ్లామ్ పట్టణానికి సమీపంలో..10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు నమోదైనట్లు పాకిస్థాన్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు ఢిల్లీలో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!