పాకిస్థాన్లో భారీ భూకంపం..3 మృతి, 50 కు పైగా మందికి గాయాలు
- September 24, 2019
పాకిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.8 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇస్లామాబాద్, అజద్ కశ్మీర్, పెషావర్, రావల్పిండి, లాహోర్ పట్టణాల్లో భూకంపంతో రహదారులు దెబ్బతిన్నాయి. పీవోకేలోని మీర్పూర్లో ఓ భవనం కుప్పకూలింది. వివిధ ప్రాంతాల్లో ముగ్గురు మృతి, సుమారు 50 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని పీవోకేలోని ఆస్పత్రులకు తరలించారు. భూప్రకంపనలతో భవనాల్లో నుంచి భయంతో పరుగులు తీసినట్లు ప్రత్యక్షసాక్షులు మీడియాతో చెప్పారు. భూకంపంతో మీర్పూర్లోని రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాలా వాహనాలు బోల్తా పడ్డాయి. పంజాబ్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతమైన జెహ్లామ్ పట్టణానికి సమీపంలో..10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు నమోదైనట్లు పాకిస్థాన్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు ఢిల్లీలో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







