పాకిస్థాన్లో భారీ భూకంపం..3 మృతి, 50 కు పైగా మందికి గాయాలు
- September 24, 2019
పాకిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.8 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇస్లామాబాద్, అజద్ కశ్మీర్, పెషావర్, రావల్పిండి, లాహోర్ పట్టణాల్లో భూకంపంతో రహదారులు దెబ్బతిన్నాయి. పీవోకేలోని మీర్పూర్లో ఓ భవనం కుప్పకూలింది. వివిధ ప్రాంతాల్లో ముగ్గురు మృతి, సుమారు 50 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని పీవోకేలోని ఆస్పత్రులకు తరలించారు. భూప్రకంపనలతో భవనాల్లో నుంచి భయంతో పరుగులు తీసినట్లు ప్రత్యక్షసాక్షులు మీడియాతో చెప్పారు. భూకంపంతో మీర్పూర్లోని రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాలా వాహనాలు బోల్తా పడ్డాయి. పంజాబ్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతమైన జెహ్లామ్ పట్టణానికి సమీపంలో..10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు నమోదైనట్లు పాకిస్థాన్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు ఢిల్లీలో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









