సౌదీ అరేబియా:తొలిసారి టూరిస్ట్ వీసా జారీ చేయనుంది
- September 27, 2019సౌదీ అరేబియా:సౌదీ అరేబియా మొదటిసారిగా పర్యాటక వీసాలు జారీ చేయనుంది.
పర్యాటక రంగాన్ని పెంపొందించుకునే క్రమంలో భాగంగా సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నడూ లేని విధంగా పర్యాకట వీసాలు జారీ చేయనుంది. 2030కెల్లా దేశ పర్యాటక రంగం ద్వారా అధిక ఆదాయాన్ని అర్జించే కార్యక్రమంలో భాగంగా ఈ మేరకు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల చమురు బావులపై జరిగిన దాడుల్లో ఆదేశ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. దాన్ని పర్యాటకం ద్వారా భర్తీ చేసుకోనుంది.
'అంతర్జాతీయ పర్యాటకులకు వీసా జారీ చేయనుండటం సౌదీ అరేబియా చరిత్రలో చారిత్రక ఘట్టం. సౌదీలోని పర్యాటక ప్రాంతాలను చూసి కచ్చితంగా ఆశ్యర్యానికి గురవుతారు. ప్రకృతి అందాలు, యునెస్కో గుర్తించిన ఐదు వారసత్వ ప్రదేశాలు పర్యాటకులను కచ్చితంగా కనువిందు చేస్తాయి' అని సౌదీ ఓ ప్రకటనలో వెల్లడించింది. శనివారం నుంచి ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రపంచ వ్యాప్తంగా 49 దేశాల పౌరులు ఇందుకు అర్హులు. విదేశీయుల డ్రెస్ కోడ్ విషయంలోనూ సౌదీ కఠిన నిబంధనలను సడలించింది.సౌదీలోని రియాద్ అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటి. ఎడారిలో నిర్మించిన ఈ నగరం ఎత్తైన కట్టడాలు, అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. ఈ కట్టడాలు, నిర్మాణాల కారణంగా అందరిని ఈ నగరం ఆకర్షిస్తోంది. దేశవిదేశాల నుంచి ఎక్కువ మంది పనులకు ఈ నగరానికి వస్తుంటారు. రియాద్ నగరం ఎందరికో ఉపాధిని కల్పిస్తోంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి