బంగారం ధరకు బ్రేకు..
- September 27, 2019
బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ మార్కెట్ అంచనాలను తలకిందులు చేస్తుంటాయి. గత వారం రోజుల పసిడి ధరలను పరిశీలిస్తే పోయిన వారం కంటే ఈ వారం మరి కొంత తగ్గి కొనుగోలు దారులను ఆకర్షిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఏకంగా రూ.400 తగ్గి రూ.39,250కు దిగొచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గుదలతో రూ.35,970కు పడిపోయింది. బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోంది. కేజీ వెండి ధర రూ.50,050కు క్షీణించింది. అదే ఢిల్లీ మార్కెట్లో అయితే పది గ్రాముల బంగారం 24 క్యారెట్లు ఉన్నది రూ.400 తగ్గి రూ.37,950కు దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.36,750కి క్షీణించింది. అక్కడ కూడా పసిడి ధరతో పాటే వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో బలహీనమైన ట్రెడ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో పసిడి ధరల పరిస్థితి కూడా ఇలాగే కొనసాగుతోంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









