దోహా లో నిర్వహించిన 'ఉచిత వైద్య శిబిరం'
- September 28, 2019
దోహా:ICBF వారి సౌజన్యంతో తెలంగాణ గల్ఫ్ సమితి కార్మిక సోదరులు మరియు మత్స్యకారుల కోసం నిర్వహించిన అల్లివియా మెడికల్ సెంటర్ వారి సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది.
దోహా లో భారత రాయబారి పి.కుమరన్ రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ICBF అధ్యక్షుడు బాబు రాజన్, ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్ ,జనరల్ సెక్రెటరీ ఆవినాష్ , అడిషినల్ జనరల్ సెక్రటరీ సుభ్రమణ్యం హెబ్బెగళు, సంతోష్ కుమార్, రజినీ మూర్తి పర్యవేక్షణలో జరిగింది.
ఈ శిబిరానికి దాదాపు 500 మందికి పైగా కార్మికులు హజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అల్లీవియా మెడికల్ సెంటర్ వారు నిపుణులైన వైద్య బ్రుందం ఏర్పాటు చేయడడమే కాకుండా వెల్ కేర్ వారి సహకారంతో ఉచితంగా కావాల్సిన మందులు సైతం పంపిణీ చేశారు.
ఈ విజయవంతమైన కార్యక్రమం నిర్వహణకు సహకరించిన ICBF కమిటీ కి, అల్లీవియా మెడికల్ సెంటర్ యాజమాన్యానికి, వైద్య బ్రుందానికీ మరియు స్టాఫ్ కు, వలంటీర్లకు ..ముఖ్యంగా ఈ వైద్య శిబిరం విజయవంతం కావడానికి తెలంగాణ గల్ఫ్ సమితి కార్యవర్గానికీ, సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)




తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







