నిర్మాతగా మారుతున్న మెగాస్టార్ పెద్దల్లుడు
- September 30, 2019మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఇప్పటికే హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు ఉన్నారు. అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం త్వరలో చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి నిర్మాత అయ్యేందుకు సిద్దం అయ్యాడు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత భర్త ఎల్ వీ విష్ణు ప్రసాద్ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలను తియ్యాలని నిర్ణయించుకున్నారు.
అయితే విష్ణు, సుస్మిత ఇద్దరు కలిసి ఫస్ట్ ట్రెండ్ కు అనుగుణంగా ఓ వెబ్ సిరీస్ ను తీసి తర్వాత పెద్ద సినిమాలను తీయాలని భావిస్తున్నారు. అయితే వెబ్ సిరీస్ కు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. విష్ణు ప్రసాద్ చెన్నైకి చెందిన వ్యాపారవేత్త. 2006లో విష్ణు, సుస్మిత వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. అయితే వెబ్ సిరీస్ లను అన్నీ భాషల్లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు విష్ణూ.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ