నిర్మాతగా మారుతున్న మెగాస్టార్ పెద్దల్లుడు
- September 30, 2019
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఇప్పటికే హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు ఉన్నారు. అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం త్వరలో చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి నిర్మాత అయ్యేందుకు సిద్దం అయ్యాడు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత భర్త ఎల్ వీ విష్ణు ప్రసాద్ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలను తియ్యాలని నిర్ణయించుకున్నారు.
అయితే విష్ణు, సుస్మిత ఇద్దరు కలిసి ఫస్ట్ ట్రెండ్ కు అనుగుణంగా ఓ వెబ్ సిరీస్ ను తీసి తర్వాత పెద్ద సినిమాలను తీయాలని భావిస్తున్నారు. అయితే వెబ్ సిరీస్ కు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. విష్ణు ప్రసాద్ చెన్నైకి చెందిన వ్యాపారవేత్త. 2006లో విష్ణు, సుస్మిత వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. అయితే వెబ్ సిరీస్ లను అన్నీ భాషల్లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు విష్ణూ.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!