అమరావతి అంబాసిడర్ గా నియమితులైన బబితా తాడే ఎవరో తెలుసా
- October 02, 2019హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి షోలో కోటి రూపాయలు గెల్చుకున్న బబితా తాడేని అమరావతి అంబాసిడర్ గా నియమించింది ఎన్నికల కమిషన్. మరికొన్ని రోజుల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో ఎలక్షన్ కమిషన్ SVEEP ప్రోగ్రాంకి అమరావతి అంబాసిడర్ గా బబితా తాడేవిని నియమించినట్లు ఓ అధికారి తెలిపారు. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్, ఎలక్టోరల్ పార్టిసిపేషన్(SVEEP)ప్రోగ్రాం ద్వారా ఓటు ప్రాధాన్యత గురించి ఓటర్లకు తెలియజేస్తుంది ఎన్నికల కమిషన్. దేశంలో ఓటరు అక్షరాస్యతను కూడా ప్రమోట్ చేస్తుంది.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని అంజన్గావ్ సుర్జీ గ్రామ నివాసి తాడే..ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్యా భోజన కుక్గా పనిచేస్తుంది. గత నెలలో జరిగిన క్విజ్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి లో పాల్గొన్న తాడే 1 కోటి రూపాయలు గెల్చుకుంది. ప్రజలను చేరుకోవటానికి, ఓటింగ్ ప్రాముఖ్యత గురించి వారికి తెలియజేయడానికి తాడే ఇప్పుడు జిల్లా రాయబారిగా ఎన్నుకోబడిందని అమరావతి జిల్లా పరిషత్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనీషా ఖత్రి తెలిపారు.
తనను అంబాసిడర్ గా నియమించడం పట్ల తాడే సంతోషం వ్యక్తం చేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని,ఇది మన దేశ బాధ్యత అని తాడే తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటింగ్ లో పాల్గొనేలా తన వంతు బాధ్యతను తాను నిర్వహిస్తానని ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు