సౌదీ పర్యటనకు వెళ్లిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌..వ్యూహం ఫలించేనా?

- October 02, 2019 , by Maagulf
సౌదీ పర్యటనకు వెళ్లిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌..వ్యూహం ఫలించేనా?

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుచేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించనున్నారు. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కాశ్మీర్‌ విషయంలో చైనా, మలేషియా, టర్కీ దేశాలను కోరినట్లుగానే సౌదీ అరేబియాను మద్దతు కోరారు. అయితే కాశ్మీర్‌ అంశంపై వాస్తవ పరిస్థితిని వివరించేందుకు అజిత్‌ దోవల్‌ సౌదీ రాజధాని రియాద్‌కు వెళ్లారు. కాశ్మీర్‌ విషయంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సౌదీఅరేబియాలు అంతగా స్పందించలేదు. సౌదీఅరేబియాలోని చమురు క్షేత్రాలపై జరిగిన దాడులతో ప్రపంచ మార్కెట్లో ఇంధనం కొరత ఏర్పడింది. భారత్‌కు సౌదీతో ఆయిల్‌ కొనుగోలుతో పాటు సత్సంబంధాలున్నాయి. ఉగ్రవాద నిర్మూలనకు భారత్‌తో సౌదీ కూడా కలుస్తోంది. కాశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా మద్దతు ఇవ్వకుండా ఉండేందుకు రాజు మమ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు వాస్తవ పరిస్థితిని వివరించేందుకు అజిత్‌ దోవల్‌ రియాద్‌ పర్యటనకు వెళ్లారని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com