సౌదీ పర్యటనకు వెళ్లిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్..వ్యూహం ఫలించేనా?
- October 02, 2019
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుచేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ను కలిసి పలు అంశాలపై చర్చించనున్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ కాశ్మీర్ విషయంలో చైనా, మలేషియా, టర్కీ దేశాలను కోరినట్లుగానే సౌదీ అరేబియాను మద్దతు కోరారు. అయితే కాశ్మీర్ అంశంపై వాస్తవ పరిస్థితిని వివరించేందుకు అజిత్ దోవల్ సౌదీ రాజధాని రియాద్కు వెళ్లారు. కాశ్మీర్ విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీఅరేబియాలు అంతగా స్పందించలేదు. సౌదీఅరేబియాలోని చమురు క్షేత్రాలపై జరిగిన దాడులతో ప్రపంచ మార్కెట్లో ఇంధనం కొరత ఏర్పడింది. భారత్కు సౌదీతో ఆయిల్ కొనుగోలుతో పాటు సత్సంబంధాలున్నాయి. ఉగ్రవాద నిర్మూలనకు భారత్తో సౌదీ కూడా కలుస్తోంది. కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్కు సౌదీ అరేబియా మద్దతు ఇవ్వకుండా ఉండేందుకు రాజు మమ్మద్ బిన్ సల్మాన్కు వాస్తవ పరిస్థితిని వివరించేందుకు అజిత్ దోవల్ రియాద్ పర్యటనకు వెళ్లారని సమాచారం.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









