దుబాయ్-హైదరాబాద్ ప్రయాణికుల వద్ద భారీగా బంగారం పట్టివేత
- October 05, 2019
హైదరాబాద్: శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారుల వివరాల ప్రకారం దుబాయ్ నుంచి శంషాబాద్లో ల్యాండ్ అయిన ఎమిరేట్స్ విమానం నుంచి దిగిన ముగ్గురు ప్రయాణీకులు అనుమానంగా కన్పించడంతో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకొని, విచారించగా.. వారి నుంచి టేప్తో చుట్టిన రెండు ప్యాకెట్లు లభించాయి. అందులో 42 ఫారిన్ మార్క్ కలిగిన బంగారు బిస్కెట్లు లభించాయి. బంగారం బరువు 4.9 కిలోలు. దాని విలువ కోటి 85 లక్షలు. ఈ బంగారం 99.9శాతం స్వచ్ఛత కలిగినవిగా అధికారులు తెలిపారు. కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం అధికారులు బంగారాన్ని సీజ్ చేశారు. అనుమానితుల వద్ద బంగారం కొన్నట్లుగా గానీ, దిగుమతి చేసుకుంటున్నట్లుగా గానీ ఎలాంటి ధృవ పత్రాలు లేవు. వారు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిర్ధారించుకున్న అధికారులు నిందితులను అరెస్టు చేసి, విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!