ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ కి నోబెల్ శాంతి పురస్కారం
- October 11, 2019
పంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ పీస్ ప్రైజ్ ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ ను వరించింది. నోబెల్ అవార్డుల కమిటీ ఈ రోజు అబీ అహ్మద్ కు శాంతి పురస్కారాన్ని ప్రకటించింది. ఇథియోపియాకు, ఎరిత్రియాకు మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడంలో ఆయన చేసిన కృషికి గాను పురస్కారాన్ని అందిస్తున్నామని తెలిపింది. శాంతిని నెలకొల్పేందుకు, ఎరిత్రియాతో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు ఆయన తీసుకున్న చర్యలు చాలా ఘనమైనవని జ్యూరీ ప్రశంసించింది.
సరిహద్దుకు సంబంధించి ఎరిత్రియాఇథియోపియాకు మధ్య 1998 నుంచి 2000 వరకు యుద్ధం జరిగింది. గత ఏడాది జూలైలో మళ్లీ ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడానికి అబీ చాలా కృషి చేశారు. నోబెల్ పురస్కారం కింద అబీ అహ్మద్ కు 9 లక్షల అమెరికా డాలర్ల నగదు బహుమతి అందుతుంది. స్వీడన్ లోని ఓస్లోలో డిసెంబర్ 10న ఆయనకు శాంతి పురస్కారాన్ని అందజేయనున్నారు.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







