సౌదీ అరేబియా లో ఏ.పి వాసి హత్య

- October 13, 2019 , by Maagulf
సౌదీ అరేబియా లో ఏ.పి వాసి హత్య

సౌదీ అరేబియాలో విశాఖపట్నం కు చెందిన సేల్స్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న అబ్దుల్‌ అయాజ్‌(54)అల్ ఖర్మ లో హత్యకు గురయ్యారని, అయితే మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు తీవ్ర జాప్యం జరుగుతోందని అయాజ్‌ కుమార్తె సమీనా షేక్‌ చేసిన ట్వీట్‌తో యంత్రాంగం చర్యలకు దిగింది. ఈ జాప్యంపై సమీనా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు ట్వీట్‌ చేయటంతో అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకు విశాఖ పోలీసులు వీరి వివరాల కోసం ఆరా తీశారు. అయితే ఈ కుటుంబ వివరాల కోసం విశాఖపట్నం లో ఎంత ప్రయత్నించినా తెలియలేదు. సమీనా కూడా ఈ సంఘటనపై ఎక్కడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో చిరునామా తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. అయితే బాధిత కుటుంబం దౌత్య కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అధికారులు మృతదేహాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com