సౌదీ అరేబియా లో ఏ.పి వాసి హత్య
- October 13, 2019
సౌదీ అరేబియాలో విశాఖపట్నం కు చెందిన సేల్స్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న అబ్దుల్ అయాజ్(54)అల్ ఖర్మ లో హత్యకు గురయ్యారని, అయితే మృతదేహాన్ని భారత్కు తీసుకువచ్చేందుకు తీవ్ర జాప్యం జరుగుతోందని అయాజ్ కుమార్తె సమీనా షేక్ చేసిన ట్వీట్తో యంత్రాంగం చర్యలకు దిగింది. ఈ జాప్యంపై సమీనా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు ట్వీట్ చేయటంతో అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకు విశాఖ పోలీసులు వీరి వివరాల కోసం ఆరా తీశారు. అయితే ఈ కుటుంబ వివరాల కోసం విశాఖపట్నం లో ఎంత ప్రయత్నించినా తెలియలేదు. సమీనా కూడా ఈ సంఘటనపై ఎక్కడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో చిరునామా తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. అయితే బాధిత కుటుంబం దౌత్య కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అధికారులు మృతదేహాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







