'షార్’లో ప్రమాదం..రెండో వీఏబీ భవనంలో కూలిన ప్లాట్ఫామ్స్..రూ.2కోట్ల ఆస్తి నష్టం!
- October 15, 2019
నెల్లూరు: సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్లోని రెండో వాహన అనుసంధాన భవనంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాకెట్ పరికరాలు అనుసంధానం చేసే ప్లాట్ ఫారాలు కూలి రూ. 2కోట్ల నష్టం వాటిల్లిందని సమాచారం. త్రుటిలో ప్రాణ నష్టం తప్పిం ది. షార్లోని రెండో వీఏబీ భవనంలో రాకెట్ అనుసంధానం చేసే ఎఫ్సీవీఆర్పీ ప్లాట్ ఫారాలు న్నాయి. పరికరాలు మోసుకెళ్లే గేర్ బాక్స్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని సరిచేసేప్పుడు అయిల్ లీకై రెండు ప్లాట్ఫారాలు కూలిపోయాయి. ప్రమాద సమయంలో సిబ్బంది టీ తాగేందుకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. షార్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ప్రమాదంపై విచారణకు ప్రత్యేక కమిటీని నియమించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!