ఇండియన్ గ్యారేజీ కార్మికులపై దాడి
- October 17, 2019కువైట్: ఇద్దరు ఇండియన్ గ్యారేజీ వర్కర్స్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ మేరకు బాధిత గ్యారేజీ వర్కర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబు హలీఫా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు, నిందితుల్లో ఒకరు మిలిటరీ యూనిఫామ్ ధరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కారు రిపెయిర్ విషయమై తలెత్తిన వివాదమే ఈ ఘటనకు కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. దాడికి సంబంధించి సిసిటీవీ కెమెరాలో అంతా రికార్డ్ అయి వుందని బాధితులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్