ఒమన్లో ఫ్యామిలీ మెడిసిన్ కాన్ఫరెన్స్ ప్రారంభం
- October 18, 2019
మస్కట్: సుల్తానేట్లో తొలి ఫ్యామిలీ మెడిసిన్ కాన్ఫరెన్స్ 350 మంది పార్టిసిపెంట్స్తో ప్రారంభమయ్యింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సీనియర్ కన్సల్టెంట్ ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ ఫాతియా అల్ కస్సాబి మాట్లాడుతూ, ఫ్యామిలీ మెడిసిన్ విభాగంలో లేటెస్ట్ డెవలప్మెంట్స్పై పార్టిసిపెంట్స్కి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడ్తుందని చెప్పారు. ఒమన్ ఫ్యామిలీ మెడిసిన్ సొసైటీ, సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ హాస్పిటల్తో కలిసి సంయుక్తంగా ఈ కాన్ఫరెన్స్ని నిర్వహిస్తోంది. ఫ్యామిలీ మెడిసిన్కి సంబంధించి సైంటిఫిక్ పేపర్స్ని ఈ సందర్భంగా కాన్ఫరెన్స్లో వుంచారు. క్యాన్సర్ ప్రివెంటింగ్ ప్రోగ్రామ్స్, కమ్యూనికబుల్ డిసీజెస్, న్యూ థెరపీస్ ఫర్ డయాబెటిస్ వంటి విభాగాలకు సంబంధించిన సైంటిఫిక్ పేపర్స్ పార్టిసిపెంట్స్కి అందజేశారు. ఒమన్ ఫ్యామిలీ మెడిసిన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అబ్దుల్ అజీజ్ అల్ మహ్రెజి మాట్లాడుతూ, కాన్ఫరెన్స్ ద్వారా పార్టిసిపెంట్స్ తాము నేర్చుకోవడమే కాకుండా, తమ అనుభవాల్ని ఇతరులతో పంచుకోవడానికి వీలవుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







