సౌదీ కు మోదీ

- October 23, 2019 , by Maagulf
సౌదీ కు మోదీ

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో సౌదీఅరేబియాలో పర్యటించనున్నారు. వార్షిక పెట్టుబడుల సదస్సు నిమిత్తం అక్టోబరు 29న మోదీ సౌదీ వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. సౌదీ అరేబియాలో అక్టోబరు 29 నుంచి 31 వరకు ఫ్యూచర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇనీషియేటివ్‌(ఎఫ్‌ఐఐ) వార్షిక సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు మోదీ వెళ్లనున్నారు. ఒక రోజు పాటు ఈ పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతల మధ్యచర్చలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com