కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- November 11, 2025
కువైట్: కువైట్ లో భారత రాయబారిగా పరమిత త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆమెకు విమానాశ్రయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ సంజయ్ కె. ములుకా, కువైట్ ప్రోటోకాల్ విభాగం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కువైట్లోని భారత రాయబార కార్యాలయం వద్ద భారత అమర వీరులకు నివాళులర్పించారు. దేశ సేవలో వారి అత్యున్నత త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
భారత్ మరియు కువైట్ మధ్య వృద్ధి, పునరుద్ధరణ మరియు శాశ్వత భాగస్వామ్యానికి ప్రతీకగా ఆమె రాయబార కార్యాలయ ప్రాంగణంలో ఒక వేప మొక్కను నాటారు. రాయబారి త్రిపాఠి బాధ్యతలు స్వీకరించడం భారతదేశం-కువైట్ సంబంధాలలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని పలువురు ప్రశంసలు కురిపించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి మరియు రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







