కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- November 11, 2025
కువైట్: కువైట్ లో భారత రాయబారిగా పరమిత త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆమెకు విమానాశ్రయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ సంజయ్ కె. ములుకా, కువైట్ ప్రోటోకాల్ విభాగం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కువైట్లోని భారత రాయబార కార్యాలయం వద్ద భారత అమర వీరులకు నివాళులర్పించారు. దేశ సేవలో వారి అత్యున్నత త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
భారత్ మరియు కువైట్ మధ్య వృద్ధి, పునరుద్ధరణ మరియు శాశ్వత భాగస్వామ్యానికి ప్రతీకగా ఆమె రాయబార కార్యాలయ ప్రాంగణంలో ఒక వేప మొక్కను నాటారు. రాయబారి త్రిపాఠి బాధ్యతలు స్వీకరించడం భారతదేశం-కువైట్ సంబంధాలలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని పలువురు ప్రశంసలు కురిపించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి మరియు రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









