కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- November 11, 2025
కువైట్: కువైట్ లో భారత రాయబారిగా పరమిత త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆమెకు విమానాశ్రయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ సంజయ్ కె. ములుకా, కువైట్ ప్రోటోకాల్ విభాగం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కువైట్లోని భారత రాయబార కార్యాలయం వద్ద భారత అమర వీరులకు నివాళులర్పించారు. దేశ సేవలో వారి అత్యున్నత త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
భారత్ మరియు కువైట్ మధ్య వృద్ధి, పునరుద్ధరణ మరియు శాశ్వత భాగస్వామ్యానికి ప్రతీకగా ఆమె రాయబార కార్యాలయ ప్రాంగణంలో ఒక వేప మొక్కను నాటారు. రాయబారి త్రిపాఠి బాధ్యతలు స్వీకరించడం భారతదేశం-కువైట్ సంబంధాలలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని పలువురు ప్రశంసలు కురిపించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి మరియు రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







