దొంగతనం కేసులో భారత వలసదారుడ్ని పట్టించిన కెమెరా

- October 28, 2019 , by Maagulf
దొంగతనం కేసులో భారత వలసదారుడ్ని పట్టించిన కెమెరా

కువైట్:ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న భారతీయ వలసదారుడొకరు, డూప్లికేట్‌ 'కీ'తో రెస్టారెంట్‌లోకి ప్రవేశించి, అందులోంచి డబ్బుని దొంగలించాడన్న అభియోగాలతో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనానికి సంబంధించి ఆధారాలు దొరకకుండా చేయగలిగిన నిందితుడు, సీసీటీవీ కెమెరా కారణంగా దొరికిపోయాడు. సీసీటీవీ కెమెరాని కూడా నిందితుడు ధ్వంసం చేసినా, అప్పటికే రికార్డ్‌ అయిన వీడియోలో నిందితుడి వ్యవహారం బయటపడింది. కేసు విచారణని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు పోలీసులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com