అంగరంగ వైభవంగా గోవర్ధన పూజ: 3500 వంటకాలతో నైవేద్యం
- October 29, 2019
గుజరాత్లోని వడోదరలో గల స్వామినారాయణ్ ఆలయంలో అద్భతమైన వేడుక జరిగింది. చూడటానికి రెండు కళ్లూ చాలవు అన్నంత భోగంగా..సోమవారం ((అక్టోబరు 28)న ఘనంగా..కన్నుల పండుగగా జరిగింది గోవర్థన పూజ. స్వామి నారాయణ్ కు 3500 రకాల వంటకాలతో నైవేద్యాన్ని సమర్పించి 'అన్నకూట్ పూజ' నిర్వహించారు. దీన్నే 'గోవర్ధన పూజ' అని కూడా అంటారు.
ఈ వేడకలో భాగంగా స్వామినారాయణ పేరుతో వెలసిన బ్రహ్మాండనాయకుడు శ్రీ మహావిష్ణువుకు 3500 రకాల వంటకాలతో నైవేద్యం సమర్పించారు. ఈ నైవేద్యంలో కేకులు, స్వీట్లు మరియు డ్రైఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఈ నైవేద్యాలను భక్తులు చక్కగా అలంకరించారు.
వరుణుడి ఆగ్రహంతో భారీ వర్షాలు కురిసి గోకులం అంతా భారీ వర్షాల్లో మునిగిపోతున్న సమయంలో గోకులంలోని ప్రజలను, పశువులను ఆదుకోవటానికి శ్రీకృష్ణుడు గోవర్థన పర్వతాన్ని తన చిటికెన్ వేలుతో ఎత్తి ప్రజలను రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు గోవర్ధనడుని స్మరిస్తూ దీపావళి వెళ్లిన రోజున ఈ పూజను నిర్వహించారు. ఈ వేడుకను వీక్షించటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







