550వ జయంతి: పాక్‌లో గురునానక్‌ స్మారక నాణేల విడుదల

- October 30, 2019 , by Maagulf
550వ జయంతి: పాక్‌లో గురునానక్‌ స్మారక నాణేల విడుదల

ఇస్లామాబాద్‌: గురునానక్‌దేవ్‌ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్‌ నానక్‌ స్మారక నాణేలను బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు ఫొటోలను ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. 'గురునానక్‌ జయంతి సందర్భంగా ఆయన స్మారక నాణేలను పాక్‌ విడుదల చేసింది' అని పేర్కొన్నారు.

కర్తార్‌పూర్‌ విషయమై గత ఏడాది నవంబర్‌లోనే భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, దీనిపై వారం క్రితం ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నుంచి కర్తార్‌పూర్‌లోని గురు ద్వారాను ఇది కలుపుతుంది. గురునానక్‌ జయంతి సందర్భంగా నవంబర్‌ 9న కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. యాత్రికుల సౌకర్యార్థం దీన్ని ముందుగానే ప్రారంభిస్తున్నారు. పాకిస్థాన్‌లోని రావినది ఒడ్డున ఉన్న నారోవల్‌ జిల్లాలో కర్తార్‌పూర్‌ సాహిబ్‌ ఉంది. యాత్రికుల వసతి కోసం పాకిస్థాన్‌ 80 ఇమ్మిగ్రేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రోజుకు 5వేల మంది యాత్రికులను అనుమతించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com