ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులకు చేపలు తీసుకుంటే..
- November 01, 2019చిన్నారులకు ఆస్తమా, శ్వాసకోశ వంటి వ్యాధులు వస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే అధిక బరువు గలవారు కూడా ఆస్తమా వ్యాధికి బాధపడుతుంటారు. దాంతో పాటు చెడు కొలెస్ట్రాల్ కూడా వారిని బాధిస్తుంది. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే.. ఏం చేయాలో పరిశీలిద్దాం..
1. చేపలతో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, న్యూట్రియన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పిల్లల్లో వచ్చే ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నుండి కాపాడుతాయి. దాంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తాయి.
2. ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఆరునెలల పాటు చేపలతో తయారుచేసిన వంటకాలు ఆహారంగా తీసుకుంటే వ్యాధి రాదని అధ్యయంలో తెలియజేశారు. తద్వారా శరీరంలో ఎప్పటి కొలెస్ట్రాల్ చేరదని వెల్లడైంది.
3. అంతేకాకుండా వారంలో రెండుసార్లు చేపలు తీసుకోవడం వలన ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు కూడా తగ్గుతుందని పరిశోధనలో స్పష్టం చేశారు. ఈ వాపు తగ్గిందంటే.. ఆస్తమా కంట్రోల్ ఉంటుంది.
4. చేపలు చిన్నారులకే కాదు పెద్దలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. చాలామంది డయాబెటిస్తో బాధపడుతుంటారు. ఈ వ్యాధి నుండి ఎలా బయటపడాలో తెలియక చికిత్సలు తీసుకుంటూ.. మందులు వాడుతుంటారు. ఈ మందులు వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
5. వ్యాధిని అదుపులో ఉంచడానికి చేపలు చాలా ఉపయోగపడుతాయి. కనుక ప్రతిరోజూ మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో చేపలను ఒక భాగం తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది. తద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవు.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత