దుబాయ్ ప్రయాణికుడి కొత్త గోల్డ్ ప్లాన్...

- November 01, 2019 , by Maagulf
దుబాయ్ ప్రయాణికుడి కొత్త గోల్డ్ ప్లాన్...

శంషాబాద్: విదేశాల నుంచి దొంగచాటుగా తీసుకొస్తున్న 662 గ్రాముల బంగారాన్ని విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 25 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దుబాయ్‌ నుంచి వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులు దొంగచాటుగా బంగారం తీసుకొస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందింది. దుబాయ్‌ నుంచి వచ్చిన విమానం దిగి బయటకు వస్తున్న ప్రయాణికులను తనిఖీ చేశారు. షేక్‌ పరియాజ్‌ అనే ప్రయాణికుడిని స్కానింగ్‌ చేయగా అతడి కడుపులో బంగారం ఉన్నట్లు తేలింది. పెద్ద పేగులో ప్లాస్టిక్‌ ట్యూబ్‌లు ఉన్నాయి. వాటిల్లో బంగారం పెట్టాడు. పసిడితోపాటు లక్ష రూపాయల విలువగల ఐఫోన్‌, 72 వేల బురఖాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బంగారాన్ని పేస్టుగా మార్చి చిన్న చిన్న ప్లాస్టిక్‌ ట్యూబుల్లో నింపి తీసుకొచ్చాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com