దుబాయ్ ప్రయాణికుడి కొత్త గోల్డ్ ప్లాన్...
- November 01, 2019
శంషాబాద్: విదేశాల నుంచి దొంగచాటుగా తీసుకొస్తున్న 662 గ్రాముల బంగారాన్ని విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 25 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులు దొంగచాటుగా బంగారం తీసుకొస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దుబాయ్ నుంచి వచ్చిన విమానం దిగి బయటకు వస్తున్న ప్రయాణికులను తనిఖీ చేశారు. షేక్ పరియాజ్ అనే ప్రయాణికుడిని స్కానింగ్ చేయగా అతడి కడుపులో బంగారం ఉన్నట్లు తేలింది. పెద్ద పేగులో ప్లాస్టిక్ ట్యూబ్లు ఉన్నాయి. వాటిల్లో బంగారం పెట్టాడు. పసిడితోపాటు లక్ష రూపాయల విలువగల ఐఫోన్, 72 వేల బురఖాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బంగారాన్ని పేస్టుగా మార్చి చిన్న చిన్న ప్లాస్టిక్ ట్యూబుల్లో నింపి తీసుకొచ్చాడు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







