ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం: దుబాయ్ ఎయిర్పోర్ట్లో ప్రయాణీకుల పాట్లు
- November 01, 2019దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 200 మందికిపైగా ప్రయాణీకులు ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు విమానం టేకాఫ్ అవ్వాల్సి వుండగా, ఎయిర్ ఇండియా సంస్థ నుంచి ఎలాంటి స్పందనా లేకుండా ప్రయాణీకుల్ని పడిగాపులు పడేలా చేశారు. తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన ప్రయాణీకులు, సోషల్ మీడియా వేదికగా సంస్థకు అలాగే భారత ప్రభుత్వాన్ని, సంబంధిత మంత్రిత్వ శాఖల్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. ఎట్టకేలకు రాత్రి సమయంలో ప్రయాణీకుల్ని ఉద్దేశించి అధికారిక ప్రకటన వచ్చింది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు విమానాన్ని రీ-షెడ్యూల్ చేశారన్నది ఆ ప్రకటన సారాంశం.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..