తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
- November 04, 2019
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామా స్మరణతో శైవక్షేత్రాలు మార్మోగిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని శ్రీశైలం పుణ్య క్షేత్రానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణలోని కాళేశ్వర ముక్తీశ్వరాలయం, వరంగల్ వేయిస్థంభాలగుడి, చెర్వుగట్టు, యాదాద్రిలోని శివాలయాకు భక్తుల బారులు తీరారు. సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస సందడి నెలకొంది. కార్తీక మాసోత్సవం సోమవారం ఉదయం గర్భాలయంలోని మూలవిరాట్కు శ్రీ మహన్యాస పూర్వక రుద్రాభిషేకంతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో మొదటి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక దీపాలను వెలిగించి స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







