ఎయిర్ ఏషియా బంపరాఫర్

- November 05, 2019 , by Maagulf
ఎయిర్ ఏషియా బంపరాఫర్

ఎయిర్ ఏషియా ఆదివారం నాడు బంపరాఫర్ ప్రకటించింది. నవంబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 6 మిలియన్ల ప్రమోషనల్ సీట్లు అందుబాటులో ఉంటాయని, వాటిని మంచి ఆఫర్ పైన కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. ఎయిర్ ఏషియా తాజా ఆఫర్ కింద విమాన టిక్కెట్ ధరను రూ.1,019గా నిర్ణయించింది. అంతర్జాతీయ రూట్లలో రూ.2,399గా నిర్ణయించింది.

ఎయిర్ ఏషియా బిగ్ మెంబర్స్, బిగ్ పే యూజర్లు, ఎయిర్ ఏషియా క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఇది నవంబర్ 3వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇతరులకు ఈ నెల 4 నుంచి 10 వరకు టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చునని సూచించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 27వ తేదీ నుంచి మార్చి 1, 2021 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చునని తెలిపింది. వ్యాల్యూ ప్యాక్ పైన కూడా మరో 20 శాతం ఆదా చేయవచ్చునని తెలిపింది. వ్యాల్యూ ప్యాక్‌లో మీల్, సీట్ సెలక్షన్, ఇన్సురెన్స్, 20 కిలోల బ్యాగేజ్ అలవెన్స్ ఉంటుంది.

ఈ సందర్భంగా కంపెనీ సీవోవో సంజయ్ కుమార్ మాట్లాడారు. సామాన్యుడికి కూడా విమాన ప్రయాణం అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలిపారు. హాలీడే, ఫెస్టివెల్ సీజన్లో ప్రయాణించేవారు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడం వల్ల ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com