షార్జా:ప్రమాదంలో భారత మహిళ మృతి
- November 05, 2019
షార్జా:దురదృష్టవశాత్తూ భారత మహిళ ఒకరు షార్జాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. టీనేజర్ అయిన తన కుమారుడి కారణంగానే ఆమె మృతి చెందడం మరింత బాధాకరం. కువైలాహ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఫోర్ వీల్ డ్రైవ్ కారుని పార్క్ చేసే సమయంలో బ్రేక్ వేయాల్సింది పోయి, 17 ఏళ్ళ టీనేజర్, యాక్సెలరేటర్ బలంగా నొక్కడంతో ఆ కారు ముందున్న మహిళపైకి కారు దూసుకుపోయింది. ఆ ఘటన సమయంలో ఆమె పార్క్ బయట కూర్చుని వున్నారు. ఈ కేసుకి సంబంధించి టీనేజర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన వెంటనే పెట్రోల్ ఆఫీసర్స్, అంబులెన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె మృతిని ధృవీకరించారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









