షార్జా:ప్రమాదంలో భారత మహిళ మృతి
- November 05, 2019
షార్జా:దురదృష్టవశాత్తూ భారత మహిళ ఒకరు షార్జాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. టీనేజర్ అయిన తన కుమారుడి కారణంగానే ఆమె మృతి చెందడం మరింత బాధాకరం. కువైలాహ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఫోర్ వీల్ డ్రైవ్ కారుని పార్క్ చేసే సమయంలో బ్రేక్ వేయాల్సింది పోయి, 17 ఏళ్ళ టీనేజర్, యాక్సెలరేటర్ బలంగా నొక్కడంతో ఆ కారు ముందున్న మహిళపైకి కారు దూసుకుపోయింది. ఆ ఘటన సమయంలో ఆమె పార్క్ బయట కూర్చుని వున్నారు. ఈ కేసుకి సంబంధించి టీనేజర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన వెంటనే పెట్రోల్ ఆఫీసర్స్, అంబులెన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె మృతిని ధృవీకరించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







