షార్జా:ప్రమాదంలో భారత మహిళ మృతి
- November 05, 2019
షార్జా:దురదృష్టవశాత్తూ భారత మహిళ ఒకరు షార్జాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. టీనేజర్ అయిన తన కుమారుడి కారణంగానే ఆమె మృతి చెందడం మరింత బాధాకరం. కువైలాహ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఫోర్ వీల్ డ్రైవ్ కారుని పార్క్ చేసే సమయంలో బ్రేక్ వేయాల్సింది పోయి, 17 ఏళ్ళ టీనేజర్, యాక్సెలరేటర్ బలంగా నొక్కడంతో ఆ కారు ముందున్న మహిళపైకి కారు దూసుకుపోయింది. ఆ ఘటన సమయంలో ఆమె పార్క్ బయట కూర్చుని వున్నారు. ఈ కేసుకి సంబంధించి టీనేజర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన వెంటనే పెట్రోల్ ఆఫీసర్స్, అంబులెన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె మృతిని ధృవీకరించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







