తీరం దాటిన బుల్బల్.. ఏపికి భారీ వర్షాలు
- November 10, 2019
విశాఖ: బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్బుల్ తుఫాను తీరం దాటింది. ఈ తుఫాను పశ్చిమ బెంగాళ్-బంగ్లాదేశ్ మీదుగా తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను దాటికి ఏపిలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నదని, మత్స్యకారులను వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాను ప్రభావంతో పారాదీప్, పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్ ఒడిశా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







