ఆగిపోయిన మెగా అల్లుడి సినిమా !
- November 11, 2019మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ 'విజేత' సినిమాతో టాలీవుడ్ తెరంగ్రేటం చేసాడు , ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. మెగా అల్లుడు అయి ఉండడంతో ఏ ఇబ్బంది లేకుండా 'సూపర్ మచి' రూపంలో తన రెండవ ప్రాజెక్ట్ను పొందగలిగాడు. ఈ చిత్రానికి పులి వాసు దర్శకత్వం వహించారు మరియు ఇది 40% షూట్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు. ఈ చిత్రం సమ్మర్ 2020 విడుదలను కూడా ప్రకటించేసారు. తాజా సమాచారం ప్రకారం, ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ చిత్రం ప్రస్తుతం నిలిపివేయబడింది అని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది.
నిర్మాత ఇప్పటికే తన పెట్టుబడితో పూర్తి చేసి, మరింత నిధులు సమకూర్చడానికి సిద్ధంగా లేనందున, 'సూపర్ మచ్చి' షూట్ నిలిపివేయబడింది. నిర్మాత రిజ్వాన్ ఇటీవల శ్రీ విష్ణు తో 'తిప్పారా మీసం' నిర్మించారు, ఈ సినిమా శ్రీ విష్ణు కెరీర్ లోనే పెద్ద డిసాస్టెర్లా ముగిసింది. 'సూపర్ మచ్చి' మిగతా సగం షూట్ పెట్టుబడులు పెట్టడానికి తిప్పారా మీసం లాభాల కోసం ఎదురు చూశాడు. ఏంచేస్తాం నిర్మాత ఒకటి తలిస్తే ఇక్కడ మరోలా జరిగింది 'తిప్పారా మీసం' పైన పెట్టుబడులు కూడా వెనక్కు రాలేదు. మొదటి సినిమా ఢమాల్ మరియు రెండవ సినిమా షూట్ నిలిచిపోవడంతో మెగా హీరో కల్యాణ్ దేవ్ కష్టాల్లో మునిగిపోయాడు.
ఈ ప్రాజెక్టును చేపట్టడానికి మరియు షూట్ను తొందరగా చుట్టడానికి మెగా కుటుంబం ప్రస్తుతం ఇతర చిత్రనిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. చూద్దాం మెగా కుటుంబం అయిన మెగా అల్లుడి సినిమా కష్టాల్ నుంచి బయటపడేస్తుందో లేదో..
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!