మరో అద్భుతాన్ని ఆవిష్కరించనున్న నాసా
- November 12, 2019
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) గత కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయోగాలు కొలిక్కివచ్చాయి. విద్యుత్ ఇంధనంతో నడిచేలా నాసా రూపొందించిన విమానం త్వరలో గాల్లోకి ఎగరనుందని సంస్థ తన ట్విట్టర్లో పేర్కొంది. ఇప్పటికే ఈ విమానాన్ని తమ ఏరోనాటిక్ ప్రయోగశాలలో పరీక్షించామని, ఫలితం సంతృప్తిగా ఉందని నాసా పేర్కొంది. ఏడాది కాలంలోపు ఎడ్వర్డ్ వైమానిక దళ బేస్ నుంచి ఇది గాల్లోకి ఎగురుతుందని పేర్కొంది. 14 మోటార్లతో నడిచే ఈ విమానానికి మాక్స్వెల్ 'ఎక్స్57' అని పేరు పెట్టింది. 2015లో తయారీ ప్రారంభమైన ఈ విమానాన్ని ఇటలీకి చెందిన టెక్నాం పీ2006టీ విమానం ఆధారంగా తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్ బ్రెంట్ కోబ్లీ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఇప్పటికే పలు కంపెనీలు విద్యుత్ ఇంధన ఆధారిత విమానాల తయారీలో నిమగ్నమై ఉన్నప్పటికీ నాసా రూపొందించిన ఈ విమానం ప్రభుత్వం ధ్రువీకరించిన వాణిజ్య ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోందని చెప్పారు. నాసా తన ఇరవై ఏళ్ల చరిత్రలో రూపొందించిన విమానాల్లో ఇది మొదటిదని తెలిపారు. కేవలం నాసాకే కాకుండా మొత్తం విమాన పరిశ్రమే ఈ తరహా విమానాలు తయారు చేసేలా సాంకేతిక పరిజ్ఞానం రూపొందుతోందని బ్రెంట్ తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!