ఎయిర్ అంబులెన్స్లో లండన్ కు నవాజ్ షరీఫ్
- November 19, 2019హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. ఇవాళ ఎయిర్ అంబులెన్స్లో లండన్ వెళ్తున్నారు. పర్సనల్ డాక్టర్ అద్నన్ ఆయనతో కలిసి వెళ్లనున్నారు. వైద్య చికిత్స నిమిత్తం నవాజ్ షరీఫ్ను లండన్కు తరలిస్తున్నారు. లండన్లో డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాత.. షరీఫ్ను అమెరికా తీసుకువెళ్లాలా లేదా అన్న అంశాన్ని ఆలోచిస్తామని షెబాజ్ షరీఫ్ తెలిపారు. నవాజ్, షెబాజ్ దేశం విడిచి వెళ్తున్న నేపథ్యంలో.. పీఎంఎల్-ఎన్ పార్టీ వ్యవహారాలను సీనియర్లు చూసుకోనున్నారు. లాహోర్లోని హజ్ టర్మినల్ నుంచి ప్రత్యేక అంబులెన్స్ విమానంలో షరీఫ్ను తీసుకువెళ్లనున్నారు. చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు షరీఫ్కు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఆ ఆర్డర్ కాపీని ఇమ్మిగ్రేషన్ అధికారులకు చూపించాల్సి ఉంటుంది. అక్రమాస్తుల కేసులో షరీఫ్ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ